రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం

by  |
రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం
X

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం కొనసాగుతుందని, రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి రైతు బంధు, రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఇపుడు కూడా రైతులకు అధిక లాభాలు వచ్చే విధంగా చూడాలనే ముఖ్యమంత్రి ఆలోచించి వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు.

Next Story

Most Viewed