చొక్కా విప్పిన మంత్రి శీనన్న.. చెక్ డ్యామ్‌లో సరదాగా

by  |
Minister Srinivas Goud
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానికులతో సరదాగా గడిపారు. చెక్ డ్యామ్ నిండి, అలుగు పారుతుండటంతో ఉత్సాహంగా చొక్కా విప్పి ఈతకొట్టారు. దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల పరిధిలోని గౌరిదేవిపల్లి గ్రామంలో రూ. 5 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మించారు. ఈ చెక్ డ్యామ్ ప్రారంభోత్సం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి, ఎమ్మెల్యే అల్లా వెంకటేశ్వర్ రెడ్డి నీటిని చూసి ఉత్సాహంగా ఈతకొట్టారు. దాదాపు గంటసేపు గ్రామస్థులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే నీళ్ల ఆనందాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed