రోడ్డు మరమత్తులు వేగవంతం చేయాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

by Shyam |

<p>దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కూడళ్లు, రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రహదారి విస్తరణ, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. పట్టణంలోని వన్ టౌన్, తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లను తొలగించాలని, వాటిని రోడ్డు అవతలికి జరపాలని చెప్పారు. వన్ టౌన్ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న దర్గాను మహాత్మా గాంధీ పాఠశాల వద్దకు [&hellip;]</p>

రోడ్డు మరమత్తులు వేగవంతం చేయాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ 
X

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కూడళ్లు, రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రహదారి విస్తరణ, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. పట్టణంలోని వన్ టౌన్, తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లను తొలగించాలని, వాటిని రోడ్డు అవతలికి జరపాలని చెప్పారు. వన్ టౌన్ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న దర్గాను మహాత్మా గాంధీ పాఠశాల వద్దకు మార్చాలని సూచించారు. దర్గాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ ఛైర్మన్ నర్సింహులు, ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

tag: Minister Srinivas Goud, Checks, Road repairs, mahabubnagar

Next Story