జర్నలిస్టుల సేవలు మరువలేనివి : మంత్రి నింరజన్‌రెడ్డి

by  |
జర్నలిస్టుల సేవలు మరువలేనివి : మంత్రి నింరజన్‌రెడ్డి
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్‌పై వదంతులు ప్రచారం కాకూండా జనాలకు సరైన సమాచారం అందిస్తోన్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరంతరం వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వార్తల సేకరణలో పడి ఆరోగ్యాన్ని నిర్ణక్ష్యం చేసుకోవద్దని సూచించారు. బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌లు తప్పక ధరించాలని కోరారు.

Tags: Minister singireddy Niranjan Reddy, journalist,Essential goods


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed