నిక్కచ్చి వార్తలకు నిదర్శనం ‘దిశ’ : సబితా ఇంద్రారెడ్డి

by  |
నిక్కచ్చి వార్తలకు నిదర్శనం ‘దిశ’ : సబితా ఇంద్రారెడ్డి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: నిక్కచ్చి వార్తలకు నిదర్శనం ‘దిశ’ పేపర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో ‘దిశ’ దినపత్రిక నూతన క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన ఒరవడితో వచ్చిన పేపర్ ఎంతో ఆసక్తికరమైన కథనాలు రాస్తున్నారన్నారని అన్నారు. అంతేగాకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని సూచించారు. బంగారు తెలంగాణలో దిశ దినపత్రిక పాత్ర ఎంతో ఉందన్నారు. అతి తక్కువ కాలంలో పాఠకుల దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. నిజాలు నిర్భయంగా రాస్తున్నారంటూ ప్రశంసించారు. ‘దిశ‘ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దిశ దినపత్రిక సీఈఓ కమల్‌నాథ్, స్టేట్ బ్యూరో ఇంచార్జి విశ్వనాథ్, నెట్ వర్క్ ఇంచార్జి ప్రవీణ్ కుమార్, జిల్లా బ్యూరో ఇంచార్జి చిలివేరు సురేష్, రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed