‘దిశ’ పత్రిక ట్రెండ్‌కు తగ్గట్టు ఉంది : మంత్రి

by  |
‘దిశ’ పత్రిక ట్రెండ్‌కు తగ్గట్టు ఉంది : మంత్రి
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలుగు మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తూ.. నిజాలను నిర్భయంగా రాస్తూ.. అత్యంత వేగంగా విశేష ప్రజాధరణ పొందుతున్న ‘దిశ’ దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్‌ను మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా.. పత్రిక, వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దిన యాజమాన్యానికి, పాత్రికేయులు, ఎడిటోరియల్ బృందానికి అభినందనలు తెలిపారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దీటుగా, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు దిశ పత్రిక ఉందన్నారు. పత్రిక, వెబ్ సైట్ రానున్న రోజుల్లో మరింత ప్రజాధరణ పొందాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. క్యాలెండర్ ఆవిష్కరించిన వారిలో దిశ ఖమ్మం బ్యూరో ఇన్‌చార్జి దువ్వా సాగర్, పాత్రికేయులు సతీష్, గురుమూర్తి, అంజద్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed