ప్రధాని మోదీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలేవి? :పువ్వాడ

by  |
ప్రధాని మోదీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలేవి? :పువ్వాడ
X

దిశ, వెబ్‌డెస్క్: పీఆర్సీ ఇవ్వడం కేసీఆర్ వల్లనే సాధ్యమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను లెక్కలతో మంత్రి కేటీఆర్ వెల్లడించారని స్పష్టం చేశారు. అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తా అన్న చందంగా.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు.

కొత్త జోనల్ వ్యవస్థను కేంద్రం క్లియర్ చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ చెప్పిన ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణను చిన్న చూపు చూస్తోంది నిజం కాదా అని నిలదీశారు. పట్టభద్రుల ఎన్నికల్లో పాన్ డబ్బా పార్టీలను ఓడించాలని అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed