జిల్లాలో 5 సెంటర్లలో వ్యాక్సినేషన్: ప్రశాంత్ రెడ్డి

by  |
జిల్లాలో 5 సెంటర్లలో వ్యాక్సినేషన్: ప్రశాంత్ రెడ్డి
X

దిశ,వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలో మొదట 15వేల మందికి వ్యాక్సినేషన్ చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. జిల్లాలో 16న 5 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎవరికైనా రియాక్షన్ అయితే యాంటీ రియాక్షన్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు.


Next Story

Most Viewed