‘చంద్రబాబులాగే నిమ్మగడ్డకు పిచ్చి ముదిరింది’

by  |
Minister Peddireddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మంత్రి పెద్దిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానన్నారు. అధికార కార్యక్రమాలకు కూడా హాజరుకాబోనని, ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారంటూ విమర్శించారు. నిమ్మగడ్డ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన పనిలేదని తోచిపుచ్చారు. ఆయనకు ప్రాయశ్చిత్తం తప్పదని మంత్రి హెచ్చరించారు. చంద్రబాబులాగే నిమ్మగడ్డకు పిచ్చి ముదిరిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.



Next Story