- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవర్గా రవాణా శాఖ మంత్రి.. ప్రయాణికులుగా మంత్రులు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ‘దళిత బంధు’ పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నేడు(సోమవార) మధ్యాహ్నం హుజూరాబాద్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ ఎత్తున తరలివెళ్లారు. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు వెళ్తోన్న వాహనానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డ్రైవర్ అయ్యారు. ఆయన వాహనంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్యే జీవన్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ‘దళిత బంధు’ పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నేడు(సోమవార) మధ్యాహ్నం హుజూరాబాద్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ ఎత్తున తరలివెళ్లారు. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు వెళ్తోన్న వాహనానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డ్రైవర్ అయ్యారు. ఆయన వాహనంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రయాణికులుగా మారారు. మంత్రి పువ్వాడ స్వయంగా వాహనం డ్రైవ్ చేశారు. హైదరాబాద్ నుంచి హుజురాబాద్కు స్పెషల్ ట్రిప్ నడుపుతున్నట్లు ఉంది. ఈ దృశ్యం ఆసక్తికరంగా ఉంది.
Next Story






