రైతులకు ఆ అవకాశం ఇద్దామనుకున్నాం… కానీ !

by  |
రైతులకు ఆ అవకాశం ఇద్దామనుకున్నాం… కానీ !
X

దిశ, వెబ్‌డెస్క్: యాసంగిలో రైతులకు మొక్కజొన్న వేసేందుకు అవకాశం ఇద్దామనుకున్నాం కానీ.. దేశీయ, విదేశీ విపణీలో భారీగా మొక్కజొన్న నిల్వలు ఉన్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం అన్ని జిల్లాల వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించగా కార్యదర్శి జనార్థన్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తే తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. మద్ధతు ధర ఇచ్చే అవకాశం లేదని ఏవో, ఏఈవోలు రైతులకు చెప్పాలని పేర్కొన్నారు. మొక్కజొన్నకు ప్రత్యామ్నాయ, మార్కెట్ డిమాండ్ పంటలపై సీఎం దృష్టికి తీసుకెళ్దామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed