‘కూలిన కుల వృత్తులకు కొత్త ఊపిరి’

by  |
‘కూలిన కుల వృత్తులకు కొత్త ఊపిరి’
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణలో నీలివిప్లవానికి ప్రభుత్వం నాంది పలికి మత్స్యకారులకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు, నల్లచెరువులలో 2.10 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఉచిత చేపపిల్లలతో మత్స్యకారులకు ఉపాధితో పాటు తెలంగాణకు ఆదాయం అన్నారు.

వనపర్తి జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల కేటాయించడం జరిగిందని, ఇప్పటికే కోటి 10 లక్షల చేప పిల్లలు వివిధ చెరువులు రిజర్వాయర్లలో విడుదల చేశామన్నారు. ఉచిత చేప పిల్లల పథకం మత్స్యకారులతో పాటు తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని, సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. సమైక్య పాలనలో కూలిన కులవృత్తులకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఊపిరి పోయడం జరుగుతుందన్నారు. రైతులు, వృత్తిదారులు ఉండే పల్లెలు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రవేశపెటడం జరుగుతుందని వివరించారు.


Next Story

Most Viewed