పేదలకు అండగా నిలుస్తాం : మంత్రి మల్లారెడ్డి

by  |
పేదలకు అండగా నిలుస్తాం : మంత్రి మల్లారెడ్డి
X

దిశ, మేడ్చల్: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామని, పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సర్వీ బాబాయ్, జీవీఆర్ ఫంక్షన్ హాళ్లలో మున్సిపాలిటీ కార్మికులకు నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్ వాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

tags : Minister Malla Reddy, distributing, goods, poor, medchal, hyderabad



Next Story

Most Viewed