ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడకూడదు

by Shyam |

<p>దిశ, మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకుండా చూడాలనేది సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి రేషన్ దుకాణంలో రేషన్ బియ్యం, రూ. 500 నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ [&hellip;]</p>

ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడకూడదు
X

దిశ, మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకుండా చూడాలనేది సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి రేషన్ దుకాణంలో రేషన్ బియ్యం, రూ. 500 నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిందని, సీఎం ఆదేశాల మేరకు బియ్యం పంపిణీ చేశామన్నారు. వలస కూలీలకు రేషన్ బియ్యం, రూ. 500 పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాల్లో మనిషికి 12 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కోసం రూ.1500 ఇస్తున్నట్లు చెప్పారు.

Tags: minister mallareddy, ration suply, comments, medchal, lockdown

Next Story