వారందరికీ కేసీఆర్ మేనమామ : మల్లారెడ్డి

by  |
mallareddy-minister 1
X

దిశప్రతినిధి, మేడ్చల్ : పేద ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్ పేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర సర్కారు మంజూరు చేసిన 58 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామలాగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి జహంగీర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జడ్పీటీసీ అనిత, ఎంపీపీ ఎల్లుబాయ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్, నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed