ఇద్దరు కేంద్రమంత్రులకు కేటీఆర్ లేఖ.. ఎందుకంటే !

by  |
ఇద్దరు కేంద్రమంత్రులకు కేటీఆర్ లేఖ.. ఎందుకంటే !
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రులు హర్దీప్‌సింగ్‌పురి, నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. రాష్ట్రం పురపాలకశాఖ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ కోసం నిధులు కోరిన మంత్రి కేటీఆర్.. వ్యూహాత్మక నాలా అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న మెట్రో నియో ప్రాజెక్టుకు సైతం నిధులు విడుదల చేయాలని, మున్సిపాలిటీల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్, మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, బయో మైనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని లేఖలో వివరించారు



Next Story

Most Viewed