ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తాం: కేటీఆర్

by  |
ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తాం: కేటీఆర్
X

దిశ, జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్ పేట్ డివిజన్, రాజీవ్ గాంధీనగర్ లో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్ తోపాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రారంబించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్యసేవలు పేదలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబా ఫసియుద్దిన్, రాజ్ కుమార్ పటెల్, సీఎన్ రెడ్డి, దేదీప్య రావు, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.

Next Story