మళ్లీ హోం ఐసోలేషన్‌‌లోకి మంత్రి కేటీఆర్

by  |
మళ్లీ హోం ఐసోలేషన్‌‌లోకి మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఏప్రిల్ 23న కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 29న దగ్గు రావడంతో డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్‌లోని యశోద దవాఖానాలో చేరారు. దగ్గు తక్కువ కావడంతో డిశ్చార్జి అయ్యారు. మళ్లీ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అయితే వైద్యులు కరోనాకు సంబంధించిన ఎలాంటి టెస్టులు చేయలేదు. మరికొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లోనే ఉండనున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed