జీడీపీ అంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ : కేటీఆర్

by  |
Minister KTR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని దోమలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకే పరిమితం కాలేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి గెలుపు ఖరారైపోయిందని తెలిపారు. వాణీదేవికి కొంతమంది రాజస్యసభ ఇవ్వాలంటున్నారు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎప్పుడైనా ప్రజాక్షేత్రం నుంచే పోటీచేశారని గుర్తుచేశారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఐటీఐఆర్‌పై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. జీడీపీ అంటే ఇప్పుడు గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై రాంచందర్‌రావు ఎందుకు మాట్లాడటం లేదని.. ఆరేళ్లుగా రాంచందర్‌రావు ఎప్పుడైనా ప్రశ్నించారా అని అడిగారు.



Next Story

Most Viewed