దేశం వెలకట్టలేని నిధిని కోల్పోయింది : మంత్రి కేటీఆర్

by  |
దేశం వెలకట్టలేని నిధిని కోల్పోయింది : మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫ్లయింగ్‌ సిఖ్‌గా ఖ్యాతి గడించిన భారత స్ప్రింట్‌ దిగ్గజం మిల్కాసింగ్‌ మృతికి మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. మిల్కా మృతి భారత క్రీడారంగానికి శాశ్వత లోటని పేర్కొన్నారు. దేశం వెలకట్టలేని నిధిని కోల్పోయిందని, మిల్కాసింగ్‌ అంకితభావం సాటిలేదని అని కేటీఆర్‌ కొనియాడారు. మిల్కాసింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అదే విధంగా భారత స్ప్రింట్‌ దిగ్గజం మిల్కాసింగ్‌ మృతికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం తెలిపారు. మిల్కా మృతి క్రీడా రంగానికి తీర‌ని లోటు అని, కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు.



Next Story

Most Viewed