నివర్ తుఫాన్‌పై కేబినెట్‌లో చర్చించాం

by  |
నివర్ తుఫాన్‌పై కేబినెట్‌లో చర్చించాం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ… నివర్ తుఫాన్‌పై కేబినెట్‌లో చర్చించామని తెలిపారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ వర్షాపాతం నమోదు అయిందని వెల్లడించారు. 30వేల హెక్టార్లలో పంటలు దెబ్బదిన్నాయని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారని అన్నారు. అంతేగాకుండా ఈ వర్షాల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందినట్టు తెలిపారు.



Next Story

Most Viewed