రైతు భరోసా కేంద్రాల నుంచే అన్ని సేవలు : కన్నబాబు

by  |
రైతు భరోసా కేంద్రాల నుంచే అన్ని సేవలు : కన్నబాబు
X

దిశ, ఏపీబ్యూరో : రైతులకు విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా రైతు భరోసా కేంద్రాల నుంచే సేవలందాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడలో పలు అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2020-25పై చర్చించారు. ప్రతీ నియోజకవర్గానికో ఫుడ్​ప్రాసెసింగ్​ ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆయా పంటలకు సంబంధించిన పంటల ఉత్పత్తుల దిగుబడుల గురించి మాట్లాడారు.

సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి పూనం మాలొండయ్య, కమిషనర్లు అరుణ్ కుమార్, ప్రద్యుమ్న, ఆయిల్ ఫెడ్ ఎండీ శ్రీకాంతనాథ్​రెడ్డి, ఆగ్రోస్ ఎండీ శ్రికేష్ బాలాజీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి విష్ణువర్ధన్ రెడ్డి, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకిరాం పాల్గొన్నారు.



Next Story

Most Viewed