హైదరాబాద్‌లో కాపురం.. అమరావతిలో పెత్తనం !

by  |
హైదరాబాద్‌లో కాపురం.. అమరావతిలో పెత్తనం !
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. ప్రతీ విషయంలో చంద్రబాబు రాజకీయం చేయడం సరికాదని విమర్శించారు. సీఎం జగన్‌కు మంచిపేరు రాకుండా ఇళ్ల పట్టాల పంపణీని కోర్టు ద్వారా ఆపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కాపురం, ఆంధ్రప్రదేశ్‌లో పెత్తనం చేస్తూ రాజకీయ అవసరాలను మాత్రమే చూసుకుంటున్నారని ఆరోపించారు. తండ్రీకొడుకు బాల మేధావులన్నా మంత్రి కన్నబాబు.. లోకేశ్‌కు వరిచేను, చేపల చెరువుకు తేడా తెలియదని.. జగన్‌పై విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షాలు చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు.



Next Story

Most Viewed