గుత్తాను పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

by  |
గుత్తాను పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వల్ప అనారోగ్యంతో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డితో గుత్తా కాసేపు మాట్లాడారు.

ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గుత్తాను పరామర్శించిన వారిలో ఎంపి లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.



Next Story