కుక్కల్లా అరుస్తున్నారు.. మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by  |
కుక్కల్లా అరుస్తున్నారు.. మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డిండి: త్వరలో జరగబోయే నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండలో టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా… పార్లమెంటులో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తీరు అస్సలు బాగా లేదని, కేంద్ర ప్రభుత్వానికి ధాన్యం కొనమని అడగాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనేలా చూడమని అడగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో భారీగా పండిన వరి ధాన్యాన్ని కొనకుండా బీజేపీ నేతలు కుక్కల్లా అరుస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ డ్రామాలను, రింగ్ మాస్టర్ లను తెరాస కార్యకర్తలు గమనించాలని సూచించారు.


Next Story

Most Viewed