జిల్లాలో భారీ వరదలు… కలెక్టర్లకు మినిస్టర్ ఫోన్

by  |
జిల్లాలో భారీ వరదలు… కలెక్టర్లకు మినిస్టర్ ఫోన్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: భారీ వర్షాలు, వరదలపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం నాలుగు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, జిల్లాల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు.

నాలుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని, దాదాపుగా అన్ని చెరువులునిండి నీళ్లు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో లోతట్టు గ్రామాల పరిస్థితిపై వాకబు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.


Next Story

Most Viewed