ఓటు ద్వారా బీజేపీకి బుద్ది చెప్పాలి

by  |
ఓటు ద్వారా బీజేపీకి బుద్ది చెప్పాలి
X

దిశ, వెబ్‎డెస్క్ :
దుబ్బాక ఉపఎన్నికలో ఓటు ద్వారా బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘానాపూర్ లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్‎కే దక్కుతోందన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రిగా తనదేనని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత కరెంటు ఇచ్చారా అని ప్రశ్నించారు. విదేశీ మక్కలు తెచ్చి మన రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

Next Story

Most Viewed