లింగన్న కుటుంబానికి హరీశ్ రావు ఆత్మీయ భరోసా

by  |
లింగన్న కుటుంబానికి హరీశ్ రావు ఆత్మీయ భరోసా
X

దిశ, దుబ్బాక: శోకసంద్రంలో మునిగిన దుబ్బాక ఎమ్మెల్యే రామ లింగారెడ్డి కుటుంబ సభ్యులకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు భరోసా ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి హరీశ్ రావు నివాళ్లర్పించారు.

ఈ క్రమంలో హరీశ్ రావు స్వయంగా రామలింగారెడ్డి భార్య సుజాతను తీసుకొచ్చి వారిలో మనోధైర్యాన్ని నింపారు. మీ ముఖంలో దైర్యమే.. లింగన్నకు ఆత్మకు శాంతి.!, ఘన నివాళి అంటూ మీకు అండగా మేమున్నామంటూ వారికి మంత్రి హరీశ్ రావు ధైర్యం చెప్పారు. ఈ మేరకు మంత్రి వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రామలింగారెడ్డి కుటుంబీకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed