అబద్ధాల బీజేపీని నమ్మొద్దు : హరీశ్ రావు

by  |
Minister Harish Rao
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి హరీశ్ రావు శనివారం రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శించారు. అంతేగాకుండా ఒక్క ఉద్యోగం కూడా కల్పించకుండా… ఉన్న ఎన్నో ఉద్యోగాలకు ఊడగొట్టేందుకు ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే దేశంలో నిరుద్యోగ పెరిగిందని వెల్లడించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి, అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అంతేగాకుండా అబద్ధాల బీజేపీని ప్రజలు నమ్మొద్దని తెలియజేశారు.


Next Story

Most Viewed