- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ,సిద్దిపేట :
సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చిన జాతీయ స్థాయి అవార్డులు గ్రామాల ఐక్యతకు నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి గ్రామీణ దీన్ దయాల్ స్వశక్తి కరణ్ అవార్డును ఆయన తన నివాసంలో శుక్రవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తౌటి ఉదయశ్రీ తిరుపతి ,ఎంపీపీ శ్రీదేవి రామచందర్ రావుతో పాటు వార్డు సభ్యులను, గ్రామ ప్రజలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులను పెద్దలింగారెడ్డి పల్లి పొందిందని మంత్రి అన్నారు. కాగా గత జూన్ 16న గ్రామీణ దీన్ దయాల్ స్వశక్తి కరణ్ పురస్కార్ కు పెద్దలింగారెడ్డి పల్లిని కేంద్రం ఎంపిక చేసింది. అయితే ప్రతి ఏడాదీ ఢిల్లీలో ఈ అవార్డులను కేంద్రం ప్రదానం చేస్తుంది. ఈ సంవత్సరం కరోనా దృష్ట్యా అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాలకు పంపింది.