హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు.. టీఆర్ఎస్‌కు ప్రజలే బాస్

by  |
హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు.. టీఆర్ఎస్‌కు ప్రజలే బాస్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట పుట్టినిల్లు అని అన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో అన్నింట్లో మనమే ముందున్నామని, సభ్యత్వ నమోదులో కూడా మనమే ముందుండాలి సూచించారు. జిల్లా ప్రజలకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించి, సభ్యత్వం నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. జాతీయ పార్టీలకు ఢిల్లీలో బాసులు ఉన్నారని.. టీఆర్ఎస్‌కు మాత్రం ప్రజలే బాస్‌లు అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు.

Next Story