- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: షిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ సిద్దిపేట ఆధ్వర్యంలో సాయిబాబా దేవాలయం ఎదురుగా ఆదివారం ఉదయం సాయిబాబా ధర్మశాల, కళ్యాణ మండపం, అర్చకుల వసతి గదుల నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు భూమిపూజ చేశారు. అనంతరం శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. అంతకు ముందు ఆలయంలో శ్రీ షిరిడి సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ స్థలంలో శివాలయం, రామాలయం, అమ్మవారి మందిరం, సాయి ధర్మశాల, కల్యాణ మండపం, అర్చకులకు వసతి గదుల నిర్మాణాలు చేపట్టనున్నట్టు ఆలయ నిర్వాహకులు వివరించారు. ఈ మేరకు ఆలయ ట్రస్ట్ ప్రతినిధుల బృందం సన్మానించింది. ఈ కార్యక్రమంలో మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story