అనాథ పెండ్లి చేసిన హరీశ్ రావు

by  |
అనాథ పెండ్లి చేసిన హరీశ్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి హరీశ్ రావు తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఎవరూ లేని అభాగ్యురాలికి అన్ని తానై నిలిచారు. చదివించి.. ఉద్యోగం కల్పించడమే కాకుండా నచ్చిన వ్యక్తికిచ్చి అంగరంగ వైభవంగా పెండ్లి కూడా చేశారు. పూర్తి వివరాళ్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లికి చెందిన భాగ్య అనే యువతి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలింది. ఈ విషయం తెలుసుకున్న హరీశ్‌ రావు ఆమెకు అండగా నిలిచారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సదనంలో వెంటనే వసతి కల్పించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. 2018 నుంచి బాలసదనంలో ఉంటూ చదుకున్న భాగ్యకు ఇటీవల అదే శాఖలో ఓ సభ్యురాలిగా కొలువు కూడా ఇప్పించారు. ఇక పెండ్లి వయస్సుకు వచ్చిన భాగ్యకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి గురువారం పెండ్లి జరిపించి తన గొప్ప మనస్సును మరోసారి చాటుకున్నారు మంత్రి హరీశ్ రావు. అంతేకాకుండా, పెండ్లి కార్యక్రమంలో పెద్ద దిక్కుగా ఉండి నూతన వధూవరులను ఆశీర్వాదించారు.

Next Story

Most Viewed