హుజురాబాద్ రైతులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం

by  |
హుజురాబాద్ రైతులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలకు నాయకులు పథకాలతో వరాలు కురిపిస్తున్నారు. ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను తమ వశం చేసుకోవడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హుజురాబాద్ నియోజక వర్గంలో గెల్లు శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావు రైతులకు తీపికబురునందించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో గెల్లు శ్రీనివాస్ గెలిస్తే.. వృద్ధాప్య పెన్షన్ 57 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారు, అలాగే ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా త్వరలోనే రుణమాఫీ తో పాటు వాటి వడ్డీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని అందువలన అందరూ కారు గుర్తుకే ఓటు వేయాలన్నారు.


Next Story