ఆ పార్టీల గుండెల్లో గుబులు పుట్టింది..

by  |
ఆ పార్టీల గుండెల్లో గుబులు పుట్టింది..
X

దిశ ప్రతినిధి, మెదక్:
మీరంతా టీఆర్ఎస్ పార్టీకి చూపిస్తున్న ఆదరణ చూసి బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు గుండెల్లో గుబులు పుట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రాయ్ పోల్ మండలం ఎల్కల్, బేగంపెట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామలింగారెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్ట కరమని అన్నారు. ఎల్కల్ గ్రామస్తులు ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటాదో మీరు ఆలోచించుకోవాలని అన్నారు. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జనాల కష్టాలు తెలియని నాయకులు ఓట్ల కోసం వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆయన అన్నారు.


Next Story