కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది: ఈటల

by  |
కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది: ఈటల
X

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని, బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచి కాపాడుకుందామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సి.యస్.అర్ గార్డెన్ లో మంగళవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణ పెను సవాల్ గా మారిందన్నారు. అనేక రకాల వ్యాధులను ఎదుర్కొన్న సత్తా మనకు ఉందని, ఇప్పుడు కూడా ధైర్యంగా ఈ సవాల్ ను ఎదుర్కొందామన్నారు. కరోనా బాధితులకు మరింత మెరుగైన సేవలను అందిద్దామని పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని తెలిపారు. అయినా కొందరు అర్ధం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఈ కష్ట కాలాన్ని సవాల్ గా తీసుకుని పని చేద్దామన్నారు. నిధులకు కొరత లేదని, ఆస్పత్రిలో సౌకర్యాల పెంపు కోసమే అధికంగా ఖర్చు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అన్ని ఇబ్బందులను అధిగమించి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed