పరకాలలో ఎర్రబెల్లి పర్యటన

by  |
పరకాలలో ఎర్రబెల్లి పర్యటన
X

దిశ, వరంగల్: రూరల్ జిల్లా పరకాలలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రతి నెల మున్సిపాలిటీకి రూ.22 లక్షలు, వార్డుకు ఒక లక్ష నిధులు మంజూరు చేస్తామన్నారు. ఓపెన్ ప్లాట్‌లో చెత్త వేస్తే సంబంధిత‌ యజమానికి రూ.5000 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ‘ నిర్లక్ష్యంగా చెత్త వేస్తే షాపుల యజమానులకూ జరిమానా వేయండి. అయినా మారకపోతే.. ఆ షాపులను సీజ్ చేయండి. పందులను పెంచుకుంటూ బతికేవారికి వేరే జీవనోపాధి కల్పిస్తాం. వెంటనే పందులను తరలించాలి’ అని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed