పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన మంత్రి

by  |
పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన మంత్రి
X

దిశ, వరంగల్ సిటీ: వరంగల్ ఏనుమాముల మార్కెట్‎లో పత్తి కొనుగోళ్లను గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నోటిఫై చేసిన 22 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి.. నేటి నుంచి సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సీసీఐ నాణ్యత ప్రమాణాలతో పత్తిని మార్కెట్‎కు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మేయర్ గుండా ప్రకాష్, కలెక్టర్ రాజీవ్ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed