‘టీఆర్ఎస్‌ను ఎదుర్కోలేకనే రంగులు మార్చి ప్రచారం’

by  |
‘టీఆర్ఎస్‌ను ఎదుర్కోలేకనే రంగులు మార్చి ప్రచారం’
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : టీఆర్ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రంగులు మార్చుకొని ప్రచారానికి వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. బీజేపీ జూటా పార్టీ అయితే కాంగ్రెస్ అబద్ధాలు, మోసకారి పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా.. పశ్చిమ నియోజకవర్గంలో బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో కలిసి ప్రచారం నిర్వహించిన ఎర్రబెల్లి ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు.. కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారన్నారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ తరలించి మోసం చేసిందని.. ఇప్పుడు బీజేపీ కూడా అదే దారిలో నడవడం సిగ్గుచేటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్‌పై ప్రశంసలు..

టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం, వరంగల్ అభివృద్ధి సాధ్యమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆ అభివృద్ధిని చూసే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన కొనియాడారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed