బాధితులకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

by  |
బాధితులకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
X

దిశ, వరంగల్: హన్మకొండ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. కుమార్‌పల్లిలో ప్రొక్లైనర్ తో క్లీన్ చేస్తుండగా ప్రిన్సి (8) అనే ఎనిమిది సంవత్సరాల బాలిక మృతి‌‌ చెందిన విషయం తెలిసిందే. కాగా, బాధిత కుటుంబీకులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ పరామర్శించారు. వెంటనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి జరిగిన ఘటన వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన బాలుడికి వెంటనే మెరుగైన వైద్యం అందే విధంగా డాక్టర్లు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు.

Next Story