బీజేపీ ఎంపీలకు ఎర్రబెల్లి సవాల్

by  |
బీజేపీ ఎంపీలకు ఎర్రబెల్లి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసి, ఓ కార్యకర్తను బలిచ్చి దుబ్బాకలో గెలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా రాష్ట్రంలో గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు ఇప్పటివరకూ రాష్ట్రానికి ఏం తెచ్చారో తెలుపాలని డిమాండ్ చేశారు. రైతుబంధు వంటి పథకం దేశంలో ఎక్కడవుందో చూపాలని సవాల్ విసిరారు. అకాల వర్షాల మూలంగా రాష్ట్ర రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినా, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తీసుకురాలేక పోయారని మండిపడ్డారు.



Next Story

Most Viewed