పరిశుభ్రతను పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం

by  |
పరిశుభ్రతను పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం
X

దిశ, వరంగల్: ప‌చ్చ‌ద‌నం- ప‌రిశుభ్ర‌త‌ను పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం మేచ‌రాజుప‌ల్లిలో పర్యటించిన మంత్రులు పల్లెప్ర‌గ‌తి కార్యక్రమ పనులను పరిశీలించారు. గ్రామంలో పరిచయం ఉన్నవాళ్లందరినీ పేరు పేరున పలకరించారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని, ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం శుభ్రంగా ఉండాలని, ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. వానాకాలం సీజ‌న్‌లో నీటి నిల్వ‌లు లేకుండా చూడలన్నారు.

Next Story

Most Viewed