అపోహల వల్ల పౌల్ట్రీ రంగం నష్టపోతోంది: ఈటల

by  |
అపోహల వల్ల పౌల్ట్రీ రంగం నష్టపోతోంది: ఈటల
X

దిశ,వెబ్‌డెస్క్: అపోహల వల్ల పౌల్ట్రీ రంగం తీవ్రంగా నష్టపోతోందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బర్డ్ ఫ్లూ పై అధికారులతో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ…బర్డ్ ఫ్లూ వల్ల ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ర్యాపిడ్ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా తెలంగాణలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు బర్డ్ ఫ్లూ రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతేడాది పౌల్ట్రీ రంగం బాగా దెబ్బతిందని చెప్పారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని ప్రజలు భయపడుతున్నారని వివరించారు.


Next Story

Most Viewed