వ్యక్తుల అవసరాల కోసం ఆయన పనిచేస్తున్నారు…

by  |
వ్యక్తుల అవసరాల కోసం ఆయన పనిచేస్తున్నారు…
X

దిశ, వెబ్ డెస్క్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రి అవంతి శ్రీనివాస రావు తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తుల అవసరాల కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారనీ మంత్రి అన్నారు. మార్చిలో నిమ్మగడ్డ రమేశ్ పదవీ కాలం ముగుస్తుందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. అందుకే హడావిడిగా ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్దంగా పనిచేస్తున్నారే లేదో ఒక్క సారి నిమ్మగడ్డ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎలా ముందుకు వెళ్తారనీ మంత్రి ప్రశ్నించారు.



Next Story