- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో : వినాయక చవితి పండుగను చేసుకోవద్దని ఏపీ ప్రభుత్వం చెప్పలేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే వినాయకుడి పూజ చేసుకోవాలని సూచించామన్నారు. సామూహికంగా వద్దని మాత్రమే చెప్పామని చెప్పుకొచ్చారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వినాయకచవితి ఉత్సవాలను బీజేపీ, టీడీపీలు రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. సీఎం జగన్ హిందూ వ్యతిరేకి అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అని.. సర్వమతాలను గౌరవిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Next Story