వాహ్ తందూరి చాయ్..!

by  |
వాహ్ తందూరి చాయ్..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన భార్య, పిల్లలు, మనుమలు, మనుమరాళ్ల తో కలిసి సోమవారం సందడి చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో చించోలి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన తందూరి చాయ్ సెంటర్‌‌కు ఆయన కుటుంబ సమేతంగా వెళ్లారు. మట్టి పాత్రలో ఇచ్చే మసాలా చాయ్ రుచి చూశారు. పర్యావరణ పరిరక్షణ తో పాటు ఆరోగ్యం పెంపొందించే మసాలా చాయ్ అందజేస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. కాగా తమ ఛాయ్ సెంటర్ కు కుటుంబ సభ్యులతో కలసి మంత్రి రావడంతో నిర్వాహకులు సంబరపడ్డారు.

Next Story

Most Viewed