అడవుల్లో మంత్రి అల్లోల భూమిపూజ

by  |
అడవుల్లో మంత్రి అల్లోల భూమిపూజ
X

దిశ, ఖానాపూర్: రాష్ట్ర వ్యాప్తంగా న‌గ‌రాలకు చేరువ‌లో ఉన్న అటవీ బ్లాకులను అభివృద్ది చేసి.. అర్బన్ పార్కులు, లంగ్ స్పేస్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఖానాపూర్ ప‌ట్టణానికి స‌మీపంలోని మస్కాపూర్ బీట్‌లో హ‌రిత‌వ‌నం (అర్బన్ ఫారెస్ట్) పార్క్ ఏర్పాటుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మావ‌ల‌, నిర్మల్, ఆసిఫాబాద్ పట్టణాలకు సమీపంలో ఇప్పటికే ప్రారంభమైన అర్బన్ ఫారెస్ట్‌లకు పర్యాటకులు తాకిడి పెరిగిందన్నారు. అందుకే ఖానాపూర్‌లో కూడా 225 హెక్టార్‌లలో రూ.8.50 కోట్ల వ్యయంతో అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.


Next Story

Most Viewed