సీఎంఆర్ఎఫ్‌కు రూ.2కోట్ల విరాళం అందజేత

by Sridhar Babu |
Puvada
X

దిశ‌, ఖ‌మ్మం: క‌రోనా బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న స‌హాయ‌క చ‌ర్య‌ల్లో తమ వంతు బాధ్యతగా వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు అంద‌జేసిన రూ.2కోట్ల విరాళాన్ని సోమ‌వారం సీఎం కేసీఆర్‌కు అంద‌జేయ‌నున్న‌ట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.ఈ క్రమంలోనే మమత వైద్య విద్యా సంస్థ చైర్మ‌న్‌గా ఉన్న మంత్రి అజయ్ కాలేజీ యాజ‌మాన్యం త‌రఫున రూ.25 లక్షల విరాళాన్ని ఆదివారం ప్ర‌క‌టించారు. మంత్రి పిలుపు మేరకు గత 5రోజులుగా ఖమ్మంలోని నగర ప్రముఖులు, వర్తక, వ్యాపారులు, విద్యా సంస్థలు, ఆస్పత్రి నిర్వాహకులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు మొత్తంగా ఇప్పటి వరకు రూ.కోటి డెబ్భై ఐదు లక్షల విలువైన చెక్కులు మంత్రికి అందజేశారు. దానికి మరో రూ.25 లక్షలు కలిపి మొత్తం రూ.2 కోట్ల విలువైన చెక్కులను రేపు హైద‌రాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను స్వ‌యంగా క‌లిసి అంద‌జేయ‌నున్నట్టు తెలిపారు.

Tags: corona, cmrf, rs.2 crore donate, minister ajay, lockdown



Next Story

Most Viewed