ఆ వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను ప్ర‌తిష్టిద్దాం..

by  |
Puvada
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జ‌రుపుకోవాల‌ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఆగస్ట్ 22న జరుపుకునే వినాయక చవితికి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సమూహం లేకుండా పండగను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు వద్దని సూచించారు. కరోనా మహమ్మారి ప్ర‌భావం వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి, బోనాల‌ వంటి పండుగలను నిరాడంబరంగా జ‌రుపుకున్నామ‌ని వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను కూడా ఎలాంటి ఆర్భాటం లేకుండా భక్తి శ్రర్దాలతో నిర్వ‌హించుకోవాల‌ని, దీనికి ప్ర‌జ‌లంద‌రూ స‌హాక‌రించాల‌ని కోరారు. పర్యావరణహిత వినాయ‌క‌ ప్రతిమల‌నే ప్ర‌తిష్టించాల‌ని సూచించారు.



Next Story

Most Viewed