మహంకాళి ఆలయాభివృద్ధికి రూ.10 కోట్లు ఇవ్వండి

by  |
మహంకాళి ఆలయాభివృద్ధికి రూ.10 కోట్లు ఇవ్వండి
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్ ఓవైసీ ఆదివారం సాయంత్రం కలిశారు. గంటపాటు సాగిన సమావేశంలో సీఎం కేసీఆర్ , అక్బరుద్దీన్ ఓవైసీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని డెవలప్ చేయాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. లాల్ దర్వాజ బోనాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయానికి కావల్సినంత స్థలం లేకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని, పండగ సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. రూ. 10 కోట్లతో టెంపుల్‌ను డెవలప్ చేయాలని వినతి పత్రం సమర్పించారు.

అటు.. పాతబస్తీలోని అప్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతుల కోసం కూడా రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. చాలమంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారని, మరమ్మతులకు నోచుకోక పోవడం వల్ల మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందని వివరించారు. వెంటనే నిధులు మంజూరు చేసి డెవలప్‌ మెంట్ ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విన్నపానికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్… మహంకాళి, దేవాలయ అభివృద్ధికి, అప్జల్ గంజ్ మసీదు మరమ్మతులకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed